మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పద్మశ్రీ పురస్కారం తెరిగి ఇచ్చేయనున్న ముజ్తాబా హుస్సేన్ : పౌరసత్వం చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్ఆర్సీ)లకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలతోపాటు ప్రముఖులు కూడా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న వారికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ ఉర్దూ రచయిత, హాస్యవేత్త ముజ్తాబా హుస్సేన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.తన పద్మశ్రీ పురస్కారాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తానని ముజ్తాబా హుస్సేన్ బుధవారం ప్రకటించారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితా అంశాలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దేశంలో పరిస్థితి నానాటికీ దిగజారుతోందని ఆయన అన్నారు.
Post Top Ad
Wednesday, December 18, 2019
Home
జాతీయం
తెలంగాణ
మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పద్మశ్రీ పురస్కారం తెరిగి ఇచ్చేయనున్న ముజ్తాబా హుస్సేన్
మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పద్మశ్రీ పురస్కారం తెరిగి ఇచ్చేయనున్న ముజ్తాబా హుస్సేన్
Admin Details
Subha Telangana News