ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీకి చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని కలిశారు. బంజారాహిల్స్లోని కృష్ణారెడ్డి ఇంటికి ఆదివారం వెళ్లిన కేసీఆర్.. ఆయన్ను పరామర్శించారు. బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బొజ్జల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు కేసీఆర్ ఆయన ఇంటికి వెళ్లినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, కేసీఆర్ తన మధ్యాహ్న భోజనాన్ని బొజ్జల ఇంట్లోనే చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అనంతరం కేసీఆర్ క్యాన్వాయ్ ప్రగతి భవన్కు చేరుకుంది.
Post Top Ad
Monday, January 06, 2020
టీడీపీ నేతలతో మంతనాలు చేయనున్న కెసిఆర్
Admin Details
Subha Telangana News