హైదరాబాద్: నగరంలో పోలీసుల కళ్లుగప్పి దొంగతనాలకు పాల్పడుతున్న మహారాష్ట్ర కు చెందిన ఘరానా ముఠా ను చందానగర్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. నిందితుల వద్ద నుండి80 లక్షల విలువచేసే 59 సిగరెట్ ప్యాకెట్ డబ్బాలను , 1 అశోక్ లేలాండ్ ట్రాలీ, టయోటా ఇటియోస్ కార్, 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చందానగర్ పోలీస్ స్టేషన్ లో శనివారం నాడు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఈనెల రెండవ తేదీన చందానగర్ అమీన్పూర్ రహదారిలో ని ఐటిసి ఆశీర్వాద్ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయంలో భారీ చోరీ జరిగింది. మహారాష్ట్ర కు చెందిన సంజయ్(38) , నామ్ దేవ్ సాంబా జి(53), రాథోడ్ బాబు(41) మరో ముగ్గురితో కలిసి జట్టుగా ఏర్పడి గత కొన్ని రోజుల నుండి రెక్కీ నిర్వహించారు అని తెలిసింది.
Post Top Ad
Saturday, January 11, 2020
భారీ చోరీని చేదించిన చందానగర్ పోలీసులు
Admin Details
Subha Telangana News