కరోనా వైరస్పై (కొవిడ్-19) ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని మహేంద్రహిల్స్లోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కరోనా నిర్ధారణ అయి ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిది మహేంద్ర హిల్స్ ప్రాంతమే కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పాఠశాలల యాజమాన్యాలు కూడా సెలవు ప్రకటించాయి. ఆ ప్రాంతంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, డీఏవీ పబ్లిక్ స్కూల్, ఆక్సీలియమ్ హైస్కూల్ వంటి స్కూళ్లు మూతపడ్డాయి. మరోవైపు, ప్రస్తుతం చికిత్స పొందుతున్న సాఫ్ట్ వేర్ యువకుడు అదే ప్రాంతంలో తిరిగి ఉండడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రపరుస్తున్నారు. ఖాళీ ప్రదేశాల్లో బ్లీచింగ్ను చల్లుతున్నారు.
Post Top Ad
Wednesday, March 04, 2020
కరోనా అలజడికి హైదరాబాద్ లో మూతపడ్డ పలు సంస్థలు , కార్యాలయాలు , స్కూల్స్
Admin Details
Subha Telangana News