ఉత్తర కొరియా రెండు క్షిపణులను పరీక్షించినట్లు తమకు సమాచారం ఉందని దక్షిణ కొరియా మిలిటరీ తెలిపింది. ఆ రెండూ షార్ట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణులుగా భావిస్తున్నట్లు చెప్పింది. ఓ కొత్త వ్యూహాత్మక క్షిపణిని పరీక్షిస్తామని ఉత్తర కొరియా ఇది వరకే చెప్పిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా-అమెరికాల మధ్య జరుగుతున్న అణు చర్చలు ఫలితం తేలకుండా ఉండగానే ఈ క్షిపణిని ప్రయోగించడం గమనార్హం. వోన్సన్ ప్రాంతం నుంచి తూర్పు తీర ప్రాంతం మీదుగా దాదాపు 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యానికి ఈ క్షిపణులు గురిపెట్టినట్లు భావిస్తున్నామని దక్షిణ కొరియా ఉన్నతాధికారులు తెలిపారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )