శుభ తెలంగాణ (28, ఏప్రిల్ , 2020) : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు 36 (వరంగల్ అర్బన్ - 27, భూపాలపల్లి -3, ములుగు - 2, జనగాం - 3, మహబూబాబాద్ - 1 , వరంగల్ రూరల్ - 0) కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఇప్పటికే వరంగల్ అర్బన్ లో 23 , ములుగులో 2 , జనగామలో 1 , మహబూబాబాద్ లో 1 డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం తెలంగాణలో మరో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1003కి చేరింది. సోమవారం మరో 16 మంది కొత్తగా డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు 332 మంది డిశ్చార్జ్ అవ్వగా, 25 మంది చనిపోయారు. ప్రస్తుతం 646 యాక్టివ్కే సులు ఉన్నాయి. అయితే తెలంగాణాలో కరోనా కేసుల నమోదు సంఖ్య రోజురోజుకి తగ్గుతూ వస్తుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే తొందర్లోనే తెలంగాణ కరోనా ఫ్రీ రాష్ట్రంగా మారే అవకాశాలున్నాయి.
Post Top Ad
Tuesday, April 28, 2020
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
Admin Details
Subha Telangana News