శుభ తెలంగాణ (08, మే , 2020 - జాతీయం ) : . మే 7 గురువారం నుంచి తమిళనాడులో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మద్యం అమ్మకాలు ప్రారంభించిన మొదటి రోజే రూ.172 కోట్ల రూపాయల మద్యం అమ్ముడైంది. 44 రోజుల తర్వాత మద్యం షాపులు ఓపెన్ కావడంతో మందు బాబులు తెగ తాగేశారు. చెన్నైలో కరోనా ప్రభావం అధికంగా ఉండటం వల్ల గ్రేటర్ చెన్నై ప్రాంతంలో మాత్రం మద్యం అమ్మకాలను సర్కార్ నిషేధించింది. ఇప్పటి వరకు తమిళనాడులో 5409 మందికి కరోనా సోకింది.
Post Top Ad
Friday, May 08, 2020
ఒక్క రోజే రూ.172 కోట్ల మద్యం అమ్మకాలు జరిగి రికార్డు
Admin Details
Subha Telangana News