శుభ తెలంగాణ (02 ,మే , 2020 - తెలంగాణ / జాతీయం ) : కరోనా వైరస్ వణికిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తాజాగా కేంద్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 35,365కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 1755 కొత్త కరోనా కేసులు.. 77 మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 9,065 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి అవ్వగా.. 1,152 మంది మరణించారు. ప్రస్తుతం కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య 25,148గా ఉందని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
Post Top Ad
Saturday, May 02, 2020
గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 1755 కొత్త కరోనా కేసులు నమోదు
Admin Details
Subha Telangana News