- శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ని సందర్శించిన తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్.
- ఈరోజు నుంచి డెమోస్ట్రిక్ ఫ్లయిట్స్ ప్రారంభమైన నేపథ్యంలో ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాన్ని సందర్శించిన సిసిఎస్..
- సీఎస్ తో పాటు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న రంగారెడ్డి కలెక్టర్ ఎయిర్ పోర్టు ఉన్నతాధికారులు.
- ఎయిర్ పోర్ట్ లోని అఱైవెల్ ప్రాంతాన్ని సందర్శించిన సీఎస్.
విమాన/రైలు/అంతర్రాష్ట్రీయంగా ప్రయాణాలు
> ప్రయాణ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అన్న వివరాలను ట్రావెల్సర్, ఏజెన్సీలు టికెత్తో పాటు ముద్రించాల్సిందే.
> స్మార్ట్ఫోన్ వినియోగించే ప్రయాణికుడు ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలి.
> కొవిడ్-19 వ్యాప్తి నియంత్రణకు విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో ప్రకటించిన విధి,విధానాలను తప్పక పాటించాలి.
> రాష్ట్రాలు/కేంద్ర పాలితప్రాంతాలు తప్పనిసరిగా ప్రయాణికులను థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే అనుమతించాలి.
> ప్రయాణ సమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించాలి. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసే బాధ్యత కూడా ప్రయాణికుడిదే.
> విమానాశ్రయాలు/రైల్వేస్టేషన్లు/బస్టాండ్లలో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి.
> విమానాశ్రయాలు/రైల్వేస్టేషన్లు/బస్టాండ్లను తరచూ శానిటైజ్ చేయాలి. క్రిమినాశక ద్రావణాలతో శుభ్రపరచాలి. అదే విధంగా ప్రయాణికులకు సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.
>ప్రయాణం ముగించుకుని బయటకు వెళ్లే సమయంలోనూ ప్రయాణికులను థర్మల్ స్క్రీనింగ్ చేయాలి.
>కరోనా లక్షణాలు కనిపించిన ప్రయాణికులను దగ్గర్లో ఐసోలేషన్ సౌకర్యం ఉన్న ఆస్పత్రికి తరలించాలి. ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలి.
>తీవ్ర కరోనా లక్షణాలు ఉన్నవారిని కొవిడ్-19 చికిత్స కేంద్రాలకు తరలించాలి.
>కరోనా లక్షణాలు స్వల్పంగా ఉంటే వారిని హోం క్వారంటైన్కు లేదా ఐసోలేటెడ్ కొవిడ్-19 వార్డుకు తరలించాలి. ఇది వారి ఎంపికను బట్టి ఉంటుంది. ఐసీఎంఆర్ ప్రామాణికాల ఆధారంగా ఇవి ఉండాలి.
>ఐసోలేటెడ్ వార్డుకు తరలించిన తర్వాత ఎవరికైనా నెగిటివ్ వస్తే అలాంటి వారిని వారం రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచిన తర్వాత పంపాలి. ఆ తర్వాత కూడా మరో వారం హోం క్వారంటైన్ విధిగా పాటించేలా జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలి.
విదేశాల నుంచి వచ్చే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

> విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ప్రయాణ తేదీ నుంచి 14రోజులు హోం క్వారంటైన్లో ఉండాలి. లేదా ఏడు రోజుల పాటు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉండాలి.
> ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.
> ఎటువంటి కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.
> విమానం/నౌకలో ప్రయాణించేటప్పుడు వ్యక్తిగత వివరాలను వెల్లడించాలి. ఒక కాపీని ఆరోగ్య, ఇమిగ్రేషన్ అధికారులకు సమర్పించాలి.
> విమానాలు, విమానాశ్రయాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి.
> బోర్డింగ్ సమయంలో ప్రయాణికులు వ్యక్తిగత దూరం పాటించాలి.
> ప్రయాణ సమయంలో విధిగా మాస్క్ ధరించాలి. చేతులు శుభ్రంగా ఉండేలా హ్యాండ్ శానిటైజర్లు వాడాలి
> ఆరోగ్య, ఇమిగ్రేషన్ అధికారులు చేసే థర్మల్ స్క్రీనింగ్కు అందరూ సహకరించాలి.
> కరోనా లక్షణాలు ఉన్నవారిని ఐసోలేషన్కు తరలించడంతో పాటు, మిగిలిన ప్రయాణికులకు క్వారంటైన్ వసతిని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కల్పించాలి.
> ప్రతి ప్రయాణికుడిని ఐసీఎంఆర్ ప్రమాణాల ప్రకారం పరీక్షించాలి.
> ఐసోలేటెడ్ వార్డుకు తరలించిన తర్వాత ఎవరికైనా నెగిటివ్ వస్తే అలాంటి వారిని వారం రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచిన తర్వాత పంపాలి. ఆ తర్వాత కూడా మరో వారం హోం క్వారంటైన్ విధిగా పాటించేలా జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలి.
> తీవ్ర ఒత్తిడికి గురయ్యేయ వారు, గర్భిణిలు, కుటుంబంలో మరణం సంభవించిన వారు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు, 10 సంవత్సరాలలోపు వయసు కలిగిన చిన్నారులు, వారి తల్లిదండ్రులకు నిర్దేశిత క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే వీరు తప్పనిసరిగా 14రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలి. వీరిని ఆయా జాల్లా అధికారులు పర్యవేక్షించాలి.