కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో పాఠశాలలను ఎప్పుడు ఎలా తెరవాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ కూడా ఆచితూచి అడుగులేస్తోంది. సాధారణంగా 2020-21 విద్యా సంవత్సరం జూన్ రెండో వారంలో ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో పరిస్థితులను బట్టి కాస్త ఆలస్యంగానే పాఠశాలలను దశలవారీగా తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా జులై 5 వరకు పదో తరగతి పరీక్షలు ఉన్న వేళ ఆ తర్వాతే స్కూళ్లను తిరిగి తెరవాలని భావిస్తున్నారు. దీనిపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి త్వరలో సమావేశం నిర్ణయించనున్నారు.
అయితే, దశల వారీగా తెరవడంలోనూ మొదటగా 8, 9, 10 తరగతులు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇందులో ఏవైనా సవాళ్లు ఎదురవుతుంటే వాటిని సరిదిద్దుకుని 6, 7 తరగతులను ప్రారంభిస్తారు. ప్రాథమిక పాఠశాలలను మాత్రం మరింత ఆలస్యంగా తెరవనున్నారు. మొదటి దశలో స్కూళ్లు తెరిచాక కూడా కొన్ని నిబంధనలు పాటించనున్నారు.
అయితే, దశల వారీగా తెరవడంలోనూ మొదటగా 8, 9, 10 తరగతులు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇందులో ఏవైనా సవాళ్లు ఎదురవుతుంటే వాటిని సరిదిద్దుకుని 6, 7 తరగతులను ప్రారంభిస్తారు. ప్రాథమిక పాఠశాలలను మాత్రం మరింత ఆలస్యంగా తెరవనున్నారు. మొదటి దశలో స్కూళ్లు తెరిచాక కూడా కొన్ని నిబంధనలు పాటించనున్నారు.