శుభ తెలంగాణ (08, మే , 2020 -విద్య ) : పెండింగ్ లో ఉన్న టెన్, ఇంటర్ సీబీఎస్ఈ పరీక్షలు జూలైలో జరగనున్నాయి. జూలై 1 నుంచి 15 వరకు పెండింగ్ లో ఉన్న టెన్,ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ తెలిపింది. ఇటీవల విద్యార్ధులతో లైవ్ లో ముచ్చటించిన హెమోడీ మంత్రి రమేష్ పోఖియాల్ పది, పన్నెండో తరగతి పరీక్షలపై సీబీఎస్ఈ ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అందుకు అనుగుణంగా నేడు ప్రకటన విడుదలైంది. జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షను ఆగష్టు 23న నిర్వహిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖియాల్ ఇటీవల తెలిపారు. జేఈఈ మెయిన్ పరీక్షలు జూలై 18, 20, 21, 22, 23 తేదీల్లో, నీట్ పరీక్షను జూలై 26న నిర్వహించనున్నట్లు కేంద్రం తెలిపిన విషయం తెలిసిందే.
Post Top Ad
Friday, May 08, 2020
సీబీఎస్ఈ టెన్,ఇంటర్ పరీక్షల పై క్లారిటీ
Admin Details
Subha Telangana News