తెలంగాణ పోలీసు శాఖలో మరో కరోనా మరణం నమోదైంది. హైదరాబాద్లో కాలాపత్తర్ పోలీసు స్టేషన్లో ఏఎస్సైగా పని చేస్తున్న యూసుఫ్ ప్రాణాలు కోల్పోయాడు. వారం రోజుల క్రితం హాస్పిటల్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. దీంతో పోలీసు డిపార్ట్మెంట్లో కోవిడ్ బారిన మరణించిన వారి సంఖ్య మూడుకి చేరింది.మే 21వ తేదీన కానిస్టేబుల్ యాదగిరి రెడ్డి కరోనా బారిన పని చనిపోయిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కోవిడ్కు బలైన తొలి పోలీసు ఈయనే. తర్వాత జూన్ 16న హోంగార్డ్ అశోక్ కోవిడ్కు బలయ్యారు. తెలంగాణలో ముగ్గురు ఐపీఎస్లు సహా దాదాపు 200 మంది పోలీసులు కోవిడ్ బారిన పడ్డారు.ఆదివారం నాటికి తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7820కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే రాష్ట్రంలో 730 కొత్త కేసులు నమోదు కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలోనే 659 కేసులను గుర్తించారు.
Post Top Ad
Tuesday, June 23, 2020
పోలీసు శాఖలో మూడో కోవిడ్ మరణం.. చికిత్స పొందుతూ ఏఎస్సై మృతి
Admin Details
Subha Telangana News