ప్రస్తుత తరుణంలో కొంతవరకు కరోనా వ్యాప్తి కొనసాగుతుందని, అయినప్పటికీ భయపడాల్సిన అవసరంలేదని షికాగోలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్లో మెడిసన్ అండ్ సర్జరీ, అంటువ్యాధుల విభాగం ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ ఎల్దండి పేర్కొన్నారు. లాక్డౌన్ ఎత్తివేతకు కేసులు పెరుగడానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ప్రస్తుతం కరోనా మొదటి దశ కొనసాగుతున్నదని, నవంబర్లో రెండో దశ ఉంటుందని తెలిపారు. బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో శుక్రవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో ఆయన సమావేశమయ్యారు. లాక్డౌన్ అన్నది కేవలం టేప్ రికార్డర్లో పాజ్ బటన్ వంటిదని చెప్పారు. గుంపులుగా చేరే అవకాశం ఉన్న పెండ్లిళ్లు, శుభకార్యాలు, పూజలు, అంతిమయాత్రలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే వైరస్ను కొనితెచ్చుకోవడమేనని చెప్పారు. కరోనా విషయంలో భయపడవద్దని, ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఉండాలని సూచించారు. ప్రస్తుతం కరోనా మొదటి దశ కొనసాగుతున్నదని, జూలై నుంచి ఆగస్టు మధ్య పతాకస్థాయికి చేరుకొని ఆ తరువాత తగ్గుముఖం పడుతుందని చెప్పారు. మళ్లీ నవంబర్ నెలలో రెండో దశ ప్రభావం చూపుతుందని తెలిపారు. కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉన్నా భయపడవద్దన్నారు. వైరస్సోకితే మందులు తీసుకొని ఇంటివద్దే విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. దవాఖానలో కచ్చితంగా చేరాలన్న నియమం ఏదీలేదని తెలిపారు. జ్వరం తలనొప్పి, వాంతులు, విరేచనాలు, అతి నీరసం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హైబీపీ, మధుమేహం, కిడ్నీ వ్యాధులున్న వాళ్లు, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. గదిలో గాలి, వెలుతురు ఉండే విధంగా చూసుకోవాలని చెప్పారు.
Post Top Ad
Saturday, June 27, 2020
నవంబర్లో కరోనా రెండోదశ
Admin Details
Subha Telangana News