కరోనా సోకిందేమోననే అనుమానంతో ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్లో శాంపిల్ ఇచ్చిన ఓ డాక్టర్కు పాజిటివ్ అని తేలింది. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో చేరగా.. నెగటివ్ అని రిపోర్ట్ వచ్చింది. దీంతో ఆయన షాకయ్యారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడెం పట్టణానికి చెందిన డాక్టర్ శంకర్ నాయక్ ఇటీవల ఖమ్మంలో ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా టెస్టులు చేయించుకున్నారు. టెస్టుల్లో పాజిటివ్ అని తేలిందని డీఎంహెచ్వో ఆయన తెలిపారు.పాజిటివ్ అని తేలడంతో ఆయనతోపాట ఆయన భార్యను కూడా గాంధీ హాస్పిటల్కు తరలించారు. మూడు రోజులు ఉంచి టెస్టులు చేయగా.. నెగటివ్ అని తేలింది. ఆయన హాస్పిటల్ సిబ్బంది, ప్రైమరీ కాంటాక్టులు 40 మందికి కరోనా టెస్టులు చేయగా నెగటివ్ అని తేలింది. అందరికీ నెగటివ్ అని రావడంతో.. డీఎంహెచ్వో మాలతిపై డాక్టర్ శంకర్ నాయక్ కలెక్టర్ కర్ణన్కు ఫిర్యాదు చేశారు.
Post Top Ad
Monday, June 29, 2020
ముందు కరోనా పాజిటివ్.. తర్వాత నెగటివ్.. డాక్టర్ షాక్
Admin Details
Subha Telangana News