హైదరాబాద్, జూలై 09(శుభ తెలంగాణ): నగరంలో వివిధ ప్రాజెక్టుల కింద చేపడుతున్న నగర రోడ్ల నిర్మాణం, విస్తరణపై పురపాలక శాఖ మంత్రి తారక రామారావు ఈరోజు సమిక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమిక్ష సమావే శానికి జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ హాజరయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లో చేపడుతున్న పలు పనులకు సంబంధించి మంత్రి సమిక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఆ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపిన అధికారులు త్వరలోనే మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయ త్చాలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న అవసరాలతో పాటు భవిష్యత్తు అవస రాలను దృష్టిలో పెట్టుకుని హైదరా బాద్ నగర మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా రోడ్ల విస్తరణ మరియు రోడ్ల నిర్మాణ కార్యక్రమా న్ని చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ సమిోక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కావాల్సిన మైక్రో ప్లానింగ్ పైన దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నూతన రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఎస్ఆర్జి, హెచ్ఆర్జిసిఎల్ - సిఆర్ఎంపీ కింద చేపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం రోడ్ల పైన జోనల్ కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించి అదేశాలు జారీ చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జిహెచ్ఎంసి కమిషనర్ కు సూచించారు. రోడ్లకు సంబంధించిన మైక్రో ప్లానింగ్ కోసం హైదరాబాద్ నగరాన్ని నాలుగు జోన్లుగా విభజించి కొని, ఒక్కో జోన్ 'పైన ఉన్న ప్రస్తుతం ఉన్న రోడ్లు పాటు భవిష్యత్తులో ఏర్పాటు చేయాల్సిన రోడ్ల నిర్మాణం, ప్రస్తుత రోడ్ల విస్తరణ వంటి కార్యక్రమాలు అన్నింటి పైన ఒక సునిశతమైన నివేదిక అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నివేదికలో ప్రస్తుతం ఉన్న రోడ్ల తో పాటు భవిష్యత్తులో రోడ్ల పైన ఏర్పడేటువంటి. జంక్షన్ల అభివృద్ధి, బస్సు బే ల నిర్మాణం, టాయిలెట్ నిర్మాణం వంటి ప్రతి అంశానికి సంబంధించి సమాచారం ఉండాలన్నారు. ఈ నివేదిక తయారీ కోసం రోడ్డు నిర్మాణ కన్స్టలెంట్ లతో, సంస్థతో కలిసి పని చేసి నెలరోజుల్లోగా ఒక ప్రాథమిక నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. హైదరాబాద్. లో ప్రస్తుతం ఉన్న ప్రతి వంద అడుగుల రోడ్డుపైన కచ్చితంగా ఒక మోడియన్, గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ నగర కమిషనర్ లోకేష్ కుమార్ కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న గ్రిడ్ రోడ్డు, రేడియల్ రోడ్డు, మిస్సింగ్, లింకు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలపైన కూదా మంత్రి కేటీఆర్ సమిక్ష నిర్వహించారు. మొదటి దశలో చేపట్టిన 23 లింకు రోడ్ల నిర్మాణం ఈ నెలాఖరు నాటికి పూర్తయ్యే. అవకాశాలు ఉన్నాయని అధికారులు మంత్రికి తెలియజేశారు. దీంతో పాటు ప్రస్తుతం చేపట్టిన సిఆర్ఎంపి రోడ్ల నిర్వహణ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నదని అధికారులు మంత్రికి తెలియజేశారు. గత నెల జూన్ లో సరాసరి 50శాతం అధికంగా వర్షపాతం నమోదైనా అప్పటికీ రోడ్లకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా రాలేని విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం మొదటి దశ సిఆర్ఎంపికి సంబంధించిన రోడ్ల నిర్మాణం 'దాదాపుగా పూర్తయిందని, ఫుట్పాళ్లు 'మిడియన్లు, శానిటేషన్ నిర్వహణ వంటి అంశాల పైన తదుపరి ప్రత్యేక దృష్టి సారిస్తామని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి తెలియజేశారు.
హైదరాబాద్, జూలై 09(శుభ తెలంగాణ): నగరంలో వివిధ ప్రాజెక్టుల కింద చేపడుతున్న నగర రోడ్ల నిర్మాణం, విస్తరణపై పురపాలక శాఖ మంత్రి తారక రామారావు ఈరోజు సమిక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమిక్ష సమావే శానికి జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ హాజరయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లో చేపడుతున్న పలు పనులకు సంబంధించి మంత్రి సమిక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఆ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపిన అధికారులు త్వరలోనే మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయ త్చాలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న అవసరాలతో పాటు భవిష్యత్తు అవస రాలను దృష్టిలో పెట్టుకుని హైదరా బాద్ నగర మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా రోడ్ల విస్తరణ మరియు రోడ్ల నిర్మాణ కార్యక్రమా న్ని చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ సమిోక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కావాల్సిన మైక్రో ప్లానింగ్ పైన దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నూతన రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఎస్ఆర్జి, హెచ్ఆర్జిసిఎల్ - సిఆర్ఎంపీ కింద చేపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం రోడ్ల పైన జోనల్ కమిషనర్లు ప్రత్యేక దృష్టి సారించి అదేశాలు జారీ చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జిహెచ్ఎంసి కమిషనర్ కు సూచించారు. రోడ్లకు సంబంధించిన మైక్రో ప్లానింగ్ కోసం హైదరాబాద్ నగరాన్ని నాలుగు జోన్లుగా విభజించి కొని, ఒక్కో జోన్ 'పైన ఉన్న ప్రస్తుతం ఉన్న రోడ్లు పాటు భవిష్యత్తులో ఏర్పాటు చేయాల్సిన రోడ్ల నిర్మాణం, ప్రస్తుత రోడ్ల విస్తరణ వంటి కార్యక్రమాలు అన్నింటి పైన ఒక సునిశతమైన నివేదిక అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నివేదికలో ప్రస్తుతం ఉన్న రోడ్ల తో పాటు భవిష్యత్తులో రోడ్ల పైన ఏర్పడేటువంటి. జంక్షన్ల అభివృద్ధి, బస్సు బే ల నిర్మాణం, టాయిలెట్ నిర్మాణం వంటి ప్రతి అంశానికి సంబంధించి సమాచారం ఉండాలన్నారు. ఈ నివేదిక తయారీ కోసం రోడ్డు నిర్మాణ కన్స్టలెంట్ లతో, సంస్థతో కలిసి పని చేసి నెలరోజుల్లోగా ఒక ప్రాథమిక నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. హైదరాబాద్. లో ప్రస్తుతం ఉన్న ప్రతి వంద అడుగుల రోడ్డుపైన కచ్చితంగా ఒక మోడియన్, గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ నగర కమిషనర్ లోకేష్ కుమార్ కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న గ్రిడ్ రోడ్డు, రేడియల్ రోడ్డు, మిస్సింగ్, లింకు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలపైన కూదా మంత్రి కేటీఆర్ సమిక్ష నిర్వహించారు. మొదటి దశలో చేపట్టిన 23 లింకు రోడ్ల నిర్మాణం ఈ నెలాఖరు నాటికి పూర్తయ్యే. అవకాశాలు ఉన్నాయని అధికారులు మంత్రికి తెలియజేశారు. దీంతో పాటు ప్రస్తుతం చేపట్టిన సిఆర్ఎంపి రోడ్ల నిర్వహణ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నదని అధికారులు మంత్రికి తెలియజేశారు. గత నెల జూన్ లో సరాసరి 50శాతం అధికంగా వర్షపాతం నమోదైనా అప్పటికీ రోడ్లకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా రాలేని విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం మొదటి దశ సిఆర్ఎంపికి సంబంధించిన రోడ్ల నిర్మాణం 'దాదాపుగా పూర్తయిందని, ఫుట్పాళ్లు 'మిడియన్లు, శానిటేషన్ నిర్వహణ వంటి అంశాల పైన తదుపరి ప్రత్యేక దృష్టి సారిస్తామని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి తెలియజేశారు.