హైదరాబాద్,జూలై 20(శుభ తెలంగాణ): విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, వచ్చే విద్యాసంవత్సరం తదితరాలపైనా త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని మండలి చీఫ్విప్ బోడకుంటి వెంక టేశ్వర్లు అన్నారు. ప్రస్తుతానికి కరోనాను కట్టడి చేయడంపై దృష్టి సారిం చాలరని అన్నారు. అందరికీ నాణ్యమైన విద్యనందించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రైవేటుకు దీటుగా గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల ఏర్పాటుతో నిరుపేదలకు చదువులను దగ్గరచేశారని అన్నారు. డ్రాపవుట్లకు అడ్డుకట్ట వేస్తున్నారు.తాజాగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులడ్రాపవుట్లను తగ్గించేందుకు జూనియర్, డిగ్రీ కాలేజీల్లో మధ్యా హ్న భోజన పథకాన్ని అమలుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించడం స్వాగతించాల్సిన విషయమన్నారు. ఇదో విప్లవాత్మక నిర్ణ్మయమన్నారు. ప్రభుత్వ విద్యావిధానం బలోపేతం చేయడంలో భాగంగా నాలుగేండ్లలో రాష్ట్రంలో 900పైగా గురుకుల విద్యాలయాలను ఏర్పాటుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం వేర్వేరుగా గురుకులాలను నెలకొల్పారు. అన్ని గురుకులాల్లో నాణ్యమైన విద్యతోపాటు ఇంగ్లిష్ మిదియంలో విద్యాబోధన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వదిలించుకున్న మోడల్ స్కూళ్లను రాష్ట్ర ప్రభుత్వం అక్కున చేర్చుకున్నది. దాదాపు 194 మోడల్ స్కూళ్లలో పూర్తిగా ఇంగ్లిష్ మొడియంలో బోధిస్తున్నది. ఇందులో బాలికల కోసం 100 హాస్టళ్లు ఏర్పాటుచేశారు. గజ్వేల్లో విద్యాహబ్ను ఏర్పాటుచేశారు. బాలికల కోసం ఏర్పాటుచేసిన కేజీబీవీల ను మరింత బలోపేతం చేశారు. కేంద్రంతో సంప్రదింపులు జరిపి బాలికల డడ్రాపవుట్లు లేకుండా కేజీబీవీల్లోనే జూనియర్ కాలేజీలను నెలకొల్పారు. బాలికల కోసం హైజీన్ కిట్లు అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనపథకంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారు. గతంలో ఏ ప్రభు త్వాలు అమలుచేయని విధంగా సన్నబియ్యంతో అన్నం పెడుతున్నారు.
హైదరాబాద్,జూలై 20(శుభ తెలంగాణ): విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, వచ్చే విద్యాసంవత్సరం తదితరాలపైనా త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని మండలి చీఫ్విప్ బోడకుంటి వెంక టేశ్వర్లు అన్నారు. ప్రస్తుతానికి కరోనాను కట్టడి చేయడంపై దృష్టి సారిం చాలరని అన్నారు. అందరికీ నాణ్యమైన విద్యనందించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రైవేటుకు దీటుగా గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల ఏర్పాటుతో నిరుపేదలకు చదువులను దగ్గరచేశారని అన్నారు. డ్రాపవుట్లకు అడ్డుకట్ట వేస్తున్నారు.తాజాగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులడ్రాపవుట్లను తగ్గించేందుకు జూనియర్, డిగ్రీ కాలేజీల్లో మధ్యా హ్న భోజన పథకాన్ని అమలుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించడం స్వాగతించాల్సిన విషయమన్నారు. ఇదో విప్లవాత్మక నిర్ణ్మయమన్నారు. ప్రభుత్వ విద్యావిధానం బలోపేతం చేయడంలో భాగంగా నాలుగేండ్లలో రాష్ట్రంలో 900పైగా గురుకుల విద్యాలయాలను ఏర్పాటుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం వేర్వేరుగా గురుకులాలను నెలకొల్పారు. అన్ని గురుకులాల్లో నాణ్యమైన విద్యతోపాటు ఇంగ్లిష్ మిదియంలో విద్యాబోధన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వదిలించుకున్న మోడల్ స్కూళ్లను రాష్ట్ర ప్రభుత్వం అక్కున చేర్చుకున్నది. దాదాపు 194 మోడల్ స్కూళ్లలో పూర్తిగా ఇంగ్లిష్ మొడియంలో బోధిస్తున్నది. ఇందులో బాలికల కోసం 100 హాస్టళ్లు ఏర్పాటుచేశారు. గజ్వేల్లో విద్యాహబ్ను ఏర్పాటుచేశారు. బాలికల కోసం ఏర్పాటుచేసిన కేజీబీవీల ను మరింత బలోపేతం చేశారు. కేంద్రంతో సంప్రదింపులు జరిపి బాలికల డడ్రాపవుట్లు లేకుండా కేజీబీవీల్లోనే జూనియర్ కాలేజీలను నెలకొల్పారు. బాలికల కోసం హైజీన్ కిట్లు అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనపథకంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారు. గతంలో ఏ ప్రభు త్వాలు అమలుచేయని విధంగా సన్నబియ్యంతో అన్నం పెడుతున్నారు.