హైదరాబాద్,
జూలై 11(శుభ తెలంగాణ):
కరోనా నేపథ్యంలో ఇప్పుడు
అత్యవసరమైతే తప్ప ఆస్పత్రిలో ఉ౦డాలనిపించడం లేదన్న విమర్షలు వస్తున్నాయి. కరోనా రోగులను
కూడా వీలైనంత వరకు ఇంట్లోనే
ఉండి జాగ్రత్తలు పాటిస్తూ వైద్యు
లు సూచినట్లు చేయమని సర్మారు
చెబుతోంది. ఇంటి వద్ద ఉన్న
కరోనా రోగులకు మరింత వెసులు
బాటు కలిగించేందుకు వీలుగా
తెలంగాణ సర్కారు కరోనా కిట్ల
ను ఉచితంగా అందజేయనుంది.
చికిత్సకు అవసరమైన బెషధాలు,
మాస్క్లు, శానిటైజర్లను సర్మారే ఉ
చితంగా సమకూర్చనుంది. వైద్య
ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేం
దర్ ఉన్నతాధికారులతో నిర్వహిం
చిన సమావేశంలో ఈ మేరకు
కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం ఆస్పత్రులలో ఎంత
మంది కరోనా రోగులు చికిత్స
పొందుతున్నారో దాదాపు అదే
స్థాయిలో ఇంటి వద్ద ఉండి చికిత్స
పొందుతున్నా వారు ఉన్నారు. కరో
నా లక్షణాలు బయటపడినా ఆస్పత్రి
కి వెళ్లాలంటే భయపడుతున్నారు.
దానికి తోడు రోగితో పాటు
మరొకరు తోడు వెళ్లాలి.
సామాజిక వ్యాప్తి నేపథ్యంలో
పేషెంట్, వారి తాలూకు బంధువు
ఇద్దరూ భయపడాల్సిన పరిస్థితి.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని
సర్కారు ఈ ఉచిత కిట్ నిర్ణయం
తీసుకుంది. 17 రోజుల పాటు
హోం క్వారంటైన్ లో ఉన్న వారి
కోసం ఈ కిట్ అందించనుంది.
బాధితుడు ఇంటి నుండే చికిత్స
పొందుతున్నాడనే సమాచారం
వైద్యులు నిర్ధారించుకోగానే వారికి
సమిప ప్రభుత్వ వైద్యశాల నుంచి
కిట్లను నేరుగా వైద్య సిబ్బంది
బాధితుని ఇంటికెళ్లి అందజేస్తుంది.
ఒకే ఇంట్లో ఒకరికి మించి కరోనా
రోగులు ఉన్నా అందరికీ ఉ
చితంగా అందిస్తుంది. వైద్య
సిబ్బంది తరచుగా ఫోన్ చేసి వారి
ఆరోగ్య సమాచారాన్ని
ఎప్పటికప్పుడు అడిగి
తెలుసుకుంటారు. ఇక కిట్లో
అందించే వస్తువులు... శానిట్రైజర్లు,
మాస్కులు, గౌజులు,
హైడ్రాక్సీక్లోరోక్విన్, పారాసిటమల్,
యాంటీ బయాటిక్స్,
లివోసెటిరిజైన్, విటమిన్
సి,ఇ,డి3, ఎసిడిటీని తగ్గించే
జెషధాలు, ఏం చేయాలి.. ఏం
చేయకూడదు అని అవగాహన
పెంపొందించే పుస్తకం ఉంటాయి.
ఈ నిర్ణయంతో అనేకులకు మేలు
జరుగనుందని తెలుస్తోంది.
ప్రజల్లో కూడా భరోసా దక్కనుంది.
Post Top Ad
Sunday, July 12, 2020
కరోన పేషంట్లకు ఇంట్లోనే వైద్యం : వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
Admin Details
Subha Telangana News