- పరిశోధనల్లో ముందున్న హైదరాబాద్ జీనోమ్
- భారత్ బయోటెక్ సంస్థలో సమీక్షించిన కెటిఆర్
తెలంగాణ నుంచే కరోనా వైరస్ కు
తొలి టీకా వస్తుందని మంత్రి
కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు..
హైదరాబాద్ లో ఉన్న భారతీయో
టెక్ సంస్థ నుంచే ఆ టీజ వచ్చే
అవకాశాలు ఉన్నట్లు ఆయన
ఆభిప్రాయపడ్డారు. హైదరాబాద్
లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న
భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ను రాష్ట్ర మంత్రి
కేటీఆర్ మంగళవారం సందర్శిం చారు. మంత్రి కేటీఆర్ తో పాటు
డాక్టర్ ఎల్లా, శ్రీమతి సుచిత్రా ఎల్లా కూడా పాల్గొన్నారు. భారత్
బయోటెక్ సంస్థ ఉద్యోగులతో మంత్రి మాట్లాడారు. సీఎండీ డాక్టర్
కృష్ణా ఎల్లా, తెలంగాణ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా డైరక్టర్ శక్తి
నాగప్ప తో కలిసి మంత్రి చర్చను నిర్వహించారు. కరోనా వైరస్
వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ ముందంజంలో ఉండడం
గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనాకు టీకా తొలుత
హైదరాబాద్ నుంచి, అందులో భారత్ బయోటెక్ నుంచి వస్తుందని
ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టీకాల అభివృద్ధి, తయారీలో
భారత్ భాగస్వామ్యం కీలకమైందని ప్రపంచదేశాలు పదేపదే
చెబుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ అవసరాల దృష్ట్యా
హైదరాబాద్ ప్రాముఖ్యత కూడా పెరిగినట్లు మంత్రి కేటీఆర్
తెలిపారు. హైదరాబాద్ నుంచి మూడవ వంతు వ్యాక్సిన్ ప్రపంచ
దేశాలకు అందించడం గర్వంగా ఉంద న్నారు. మీ అందరి
నిరంతర కృషి వల్లే ఇది సాధ్యమవుతోందని మంత్రి తెలిపారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కూడా
మంత్రి కేటీఆర్ నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు.